'అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి' | pattipati pullarao serious on crda officers | Sakshi
Sakshi News home page

'అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి'

Jan 29 2016 2:01 PM | Updated on Sep 3 2017 4:34 PM

రాజధాని ప్రాంత రైతులతో సక్రమంగా వ్యవహరించడం లేదని సీఆర్డీఏ అధికారులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు: రాజధాని ప్రాంత రైతులతో సక్రమంగా వ్యవహరించడం లేదని సీఆర్డీఏ అధికారులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

రైతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నేతల వల్లనే సమస్యలు వస్తున్నాయని చెప్పడంతో అధికారులపై ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో రైతుల సమస్యలను పరిష్కరించాని ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement