చెరువులో పడి యువకుడి మృతి | one young man died | Sakshi
Sakshi News home page

చెరువులో పడి యువకుడి మృతి

Sep 26 2016 12:15 AM | Updated on Sep 28 2018 3:41 PM

వడ్డెపల్లి రిజర్వాయర్‌లో ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుని తల్లి పాలడుగుల లక్ష్మి కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాధు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమిడికి చెందిన పి.రాజేందర్‌ (28) శుక్రవారం బట్టలు ఉతుక్కునేందుకు రిజర్వాయర్‌లోకి వెళ్లాడు.

కాజీపేట:వడ్డెపల్లి రిజర్వాయర్‌లో ఓ యువకుడు ప్రమాదవశాత్తు  జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుని తల్లి పాలడుగుల లక్ష్మి కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాధు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమిడికి చెందిన పి.రాజేందర్‌ (28) శుక్రవారం బట్టలు ఉతుక్కునేందుకు రిజర్వాయర్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి రిజర్వాయర్‌లో పడ్డాడు. తమ కుమారుడికి ఈత రాక నీటమునిగి మరణించినట్లు లక్ష్మి ఫిర్యాధుచేసింది. కాజీపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement