రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | One man dead in Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Oct 23 2016 11:01 PM | Updated on Sep 4 2017 6:06 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గండి క్షేత్రం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

చక్రాయపేట : గండి క్షేత్రం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలోకి వెళ్తే... చిలేకంపల్లెకు చెందిన సుబ్బరాయుడు(29) ట్రిపుల్‌ ఐటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే వాడు. ఆయన డ్యూటీ ముగించుకొని తన మామ లక్కిరెడ్డిపల్లె మండలం చెంచోళ్లపల్లెకు చెందిన వెంకటేశ్వర్లుతో కలిసి వస్తున్నారు. మార్గం మధ్యలోని అద్దాలమర్రి క్రాస్‌ సమీపాన సుబ్బరాయుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఆటో వచ్చి వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందాడు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇడుపులపాయ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement