కనిగిరి మండలకేంద్రంలోని ఎనిమిదవ వార్డులో ఓ పెంకుటిల్లు బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది.
కనిగిరి(ప్రకాశం జిల్లా): కనిగిరి మండలకేంద్రంలోని ఎనిమిదవ వార్డులో ఓ పెంకుటిల్లు బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఖైరూన్ బీ(60) అనే వృద్ధురాలు మృతిచెందగా.. ఆమె మనవరాలు హసీనాకు తీవ్రగాయాలయ్యాయి.
హసీనాను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి బాగా నాని కూలి ఉంటుందని భావిస్తున్నారు.