కారు బోల్తా: ఒకరు మృతి | one dies as car turns turtle in mahabubnagar district | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఒకరు మృతి

Sep 22 2017 8:56 AM | Updated on Aug 30 2018 4:15 PM

భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు.

మహబూబ్‌నగర్‌:
భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మహ్మద్‌ లతీఫ్‌, అతని కుటుంబీకులు, బంధువులతో కలిసి కారులో వెళ్తుండగా జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో మహ్మద్ లతీఫ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య, ఇద్దరు కుమారులతోపాటూ మరో ముగ్గురు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు కేరళ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement