ఏడిపింఛెన్‌.. ! | old woman suffers fof pension in hindupur | Sakshi
Sakshi News home page

ఏడిపింఛెన్‌.. !

Oct 13 2016 11:31 PM | Updated on Oct 4 2018 5:35 PM

ఏడిపింఛెన్‌.. ! - Sakshi

ఏడిపింఛెన్‌.. !

పింఛన్‌ కోసం పాట్లు తన ప్రాణాలమీదకొచ్చాయంటోంది.

హిందూపురం టౌన్‌ :  పింఛన్‌ కోసం పాట్లు తన ప్రాణాలమీదకొచ్చాయంటోంది.. హిందూపురానికి చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ. పట్టణంలోని బెంగళూరు రోడ్డులో నివాసముంటున్న లక్ష్మమ్మ కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్‌ తీసుకుంటోంది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిగా ఆమెకు పింఛన్‌ అందడం లేదు. ఇదే విషయమై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  లక్ష్మి దృష్టికి ఏడాది క్రితం తీసుకెళ్లింది. నాటి నుంచి ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చిన ఆమె మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులోనే సొమ్మసిల్లి పడిపోయింది. అయినా ఏ ఒక్కరూ వృద్ధురాలిని పలకరించకపోవడం దురదృష్టకరం.

Advertisement
 
Advertisement
Advertisement