పుష్కరిణిలో పురాతన బావి ఆనవాళ్లు | old well in pushkarini | Sakshi
Sakshi News home page

పుష్కరిణిలో పురాతన బావి ఆనవాళ్లు

Apr 30 2016 5:11 AM | Updated on Mar 28 2018 11:26 AM

పుష్కరిణిలో పురాతన బావి ఆనవాళ్లు - Sakshi

పుష్కరిణిలో పురాతన బావి ఆనవాళ్లు

మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో శనివారం

బావిలోంచి సన్నటి ఊటగా నీటి ధార
మిషన్‌కాకతీయలో భాగంగా సుందరీకరణ
జేసీబీతో పని చేస్తుండగా బయటపడ్డ వైనం

చేవెళ్ల: మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆం జనేయస్వామి దేవాలయ ఆవరణలో శనివారం పుష్కరిణి (గుండం) సుందరీ కరణ పనులు చేపడుతుండగా పురాతనమైన బావి ఆనవాళ్లు కనిపించాయి. ఈ పుష్కరిణి అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా రూ.32లక్షలు మం జూరుచేసింది. ఈ పనులను ఇటీవల  మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభిం చారు. అప్పటి నుంచి కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా జేసీబీతో లోతు తీసే పని చేస్తుండగా పక్కనే ఉంచిన టిప్పర్ మట్టిలో కుంగడం కనిపించింది.

వెంటనే అప్రమత్తమై టిప్పర్‌ను పక్కకు తొలగిం చారు. జేసీబీతో అదే స్థలంలో లోతుగా తవ్వగా బావి ఆనవాళ్లు కనిపించాయి. సన్నగా నీటిధార వస్తుండడం ఈ వాదనకు బలాన్ని చేకూర్చింది. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ బావి ఉండేదని, కాలక్రమంలో వర్షాలకు మట్టి కూరుకుపోయి మూసుకుపోయి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారుగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడం, పుష్కరిణి అతి పురాతనమైనది కావడంతో బావి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ఆలయ పూజారి పి.రాఘవేంద్రాచారిని అడగ్గా అప్పట్లో బావి ఉన్నట్లు పెద్దలు చెబుతుండేవార న్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పురావస్తు శాఖకు ఈ విషయాన్ని విన్నవించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement