నగర శివారులోని నేషనల్పార్కు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతపురం సెంట్రల్ : నగర శివారులోని నేషనల్పార్కు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 55 సంవత్సరాల వయస్సు, తెలచొక్క, తెల్ల పంచె ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.