మండలంలోని కేసరపల్లి వద్ద భర్తతో గొడవ పడుతూ ఏలూరు కాలువలో గల్లంతైన చౌటపల్లి దీప్తి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
జాడ లేని దీప్తి
Aug 25 2016 8:01 PM | Updated on Sep 4 2017 10:52 AM
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
గన్నవరం:
మండలంలోని కేసరపల్లి వద్ద భర్తతో గొడవ పడుతూ ఏలూరు కాలువలో గల్లంతైన చౌటపల్లి దీప్తి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. దీప్తి కాలువలో పడి మూడు రోజులైంది. గురువారం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎయిర్బోట్లతో కాలువలో ముమ్మరంగా జల్లెడ పడుతున్నారు. సిఐ అహ్మద్అలీ, ఎస్ఐ శ్రీనివాస్ల సిబ్బంది కేసరపల్లి నుండి అజ్జంపూడి వరకు కాలువ వెంట ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. అయితే అజ్జంపూడి వద్ద కాలువలో అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క గాలింపుకు ఆటంకంగా మారింది. దీప్తి ఆచూకీపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement