20న ఎంపీఈఓ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు | Sakshi
Sakshi News home page

20న ఎంపీఈఓ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

Published Thu, Sep 15 2016 12:22 AM

mpeo interviews on 20th

అనంతపురం అగ్రికల్చర్‌ : మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ (ఎంపీఈఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బీఎస్‌ సుబ్బరాయుడు తెలిపారు. 76 పోస్టులకు 560 దరఖాస్తులు రాగా వాటిని రెండు దఫాలుగా పరిశీలించి  విద్యార్హత, రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా 156 మందిని ఎంపిక చేసి ఇంటర్వ్యూలకు పిలిచినట్లు తెలిపారు.  కాల్‌లెటర్లు అందుకున్న అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లతో 20న ఉదయం 9 గంటలకు స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.  

Advertisement
Advertisement