![పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/4/61470242843_625x300.jpg.webp?itok=VgSHU7Qd)
కోదాడరూరల్): పుట్టిన బిడ్డకు గంట లోపు తప్పకుండా ముర్రుపాలు తాగించాలని డాక్టర్ మధుసూదన్రెడ్డి సూచించారు. బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదే విధంగా కొమరబండలో కూడ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ సంపెట రవిగౌడ్, ఎంపీటీసీ సభ్యులు బత్తుల వెంకటేశ్వర్లు, కె.ఆదిలక్ష్మి, కె.పద్మజ, కె.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.