భక్తిశ్రద్ధలతో మొహర్రం | Mohrram devote ourselves | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో మొహర్రం

Oct 13 2016 12:01 AM | Updated on Sep 4 2017 5:00 PM

భక్తిశ్రద్ధలతో మొహర్రం

భక్తిశ్రద్ధలతో మొహర్రం

శాంతి, ధర్మాల పరిరక్షణయే ధ్యేయంగా పోరాడి అమరులైన (షహీద్‌) వీరుల స్మృతి చిహ్నంగా మొహర్రం కార్యక్రమాలను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక అమీన్‌పీర్‌ దర్గాలోని పీర్ల చావడిలో దర్గా పీఠా«ధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ ఆ«ధ్వర్యంలో∙పీర్ల వద్ద మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కడప కల్చరల్‌:
శాంతి, ధర్మాల పరిరక్షణయే ధ్యేయంగా పోరాడి అమరులైన (షహీద్‌) వీరుల స్మృతి చిహ్నంగా మొహర్రం కార్యక్రమాలను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక అమీన్‌పీర్‌ దర్గాలోని పీర్ల చావడిలో దర్గా పీఠా«ధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ ఆ«ధ్వర్యంలో∙పీర్ల వద్ద మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక భక్తులతోపాటు బయటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప నగరం నాగరాజుపేటలోని బాదుల్లా మకాన్‌లో మూడు రోజులపాటు పీర్లను ప్రతిష్ఠించి ప్రార్థనలు చేశారు. నగరానికి చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరై పీర్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. స్థానిక విశ్వనాథపురంలోని పీర్ల చావిడిలో విశేష ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పలువురు భక్తులు ధైర్య త్యాగాలకు చిహ్నంగా నిప్పులపై నడిచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement