కడప అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వలన జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజుపాలెంలో 35.6 మి.మీ, చాపాడులో 31.6 మి.మీ, దువ్వూరులో 10.2 మి.మీ, మైదుకూరులో 5.8 మి.మీ, ప్రొద్దుటూరులో 5.8 మి.మీ, కొండాపురంలో 3.2 మి.మీ, ముద్దనూరు 3.2 మి.మీ, జమ్మలమడుగు 4.4 మి. మీ, మైలవరం 2.4, సిద్ధవటం 1.4, కమలాపురం 3.2, ఖాజీపేట 2.2 మి.మీ, చెన్నూరు 8.2 మి.మీ, కడప 1.2 మి. మీ వర్షం కురిసింది.
రెండు మండలాల్లో పంట నష్టం
జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకు డి ఠాకూర్ నాయక్ తెలిపారు. సింహాద్రిపురం మండలంలో పత్తి 80 ఎకరాల్లోను, వేరుశనగ పంట 10 ఎకరాల్లోను, మినుము పంట 10 ఎకరాల్లోను దెబ్బతిన్నట్లు తెలిపారు. అలాగే దువ్వూరు మండలంలో వరి పంట 340 ఎకరాల్లోను, వేరుశనగ పంట 125 ఎకరాల్లోను, కంది పంట 100 ఎకరాల్లోను, మినుము పంట 50 ఎకరాల్లోను దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు.
జిల్లాలో ఓ మోస్తరు వర్షం
Published Wed, Aug 31 2016 11:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement