గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | man died in road accident | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Sep 24 2016 9:47 PM | Updated on Aug 30 2018 4:10 PM

అన్నపురెడ్డిగూడెం (వేములపల్లి) గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని అన్నపురెడ్డి గూడెం క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం చోటు చేసుకుంది.

అన్నపురెడ్డిగూడెం (వేములపల్లి)
 గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని అన్నపురెడ్డి గూడెం క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం చోటు చేసుకుంది. వేములపల్లి ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం రంగూండ్ల గ్రామానికి చెందిన ధరావత్‌ రమేష్‌ (28) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు వస్తూ శెట్టిపాలెం క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ పోయించుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది.  దీంతో తలకు తీవ్ర గాయాలడంతో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement