బాలికను మోసగించిన కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు | man cheated by girl.. 7 years imprisonment | Sakshi
Sakshi News home page

బాలికను మోసగించిన కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు

Jan 19 2017 1:40 AM | Updated on Jul 28 2018 8:44 PM

బాలికను నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఏడేళ్ల కారాగార శిక్షను న్యాయమూర్తి విధించారు.

కొయ్యలగూడెం : బాలికను నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఏడేళ్ల  కారాగార శిక్షను న్యాయమూర్తి విధించారు. ఎస్సై ఎస్‌.ఎస్‌.ఎస్‌.పవన్‌కుమార్‌ కథనం ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఏలేటి దిలీప్‌కుమార్‌ లైంగికదాడి చేశాడు. ఈ మేరకు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రజువు కావడంతో జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.సత్యానందం అతనికి ఏడేళ్ల కారాగార శిక్ష విధించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement