మడ్తపల్లిలో విషాదం | madtapalli incident | Sakshi
Sakshi News home page

మడ్తపల్లిలో విషాదం

Jul 28 2016 12:16 AM | Updated on Sep 4 2017 6:35 AM

మేడారం సమీపంలోని జంపన్నవాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన శ్రీధర్‌ ఆచూకీ తెలియకపోవడంతో అతడి స్వగ్రామం రేగొండ మండలం అడ్తిపల్లిలో విషాదం అలుముకుంది.

  • ఇంకా తెలియని గల్లంతైన శ్రీధర్‌ ఆచూకీ
  • మూడు రోజులుగా గాలింపు
  • రేగొండ : మేడారం సమీపంలోని జంపన్నవాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన శ్రీధర్‌ ఆచూకీ తెలియకపోవడంతో అతడి స్వగ్రామం రేగొండ మండలం అడ్తిపల్లిలో విషాదం అలుముకుంది. వరంగల్‌లో వడ్రంగి పనిచేస్తున్న శ్రీధర్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ (36) శనివారం తోటి కార్మికులతో కలిసి మేడారం వెళ్లి, వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం మూడు రోజులుగా కుటుంబసభ్యులు, బంధువులు మేడారం వెళ్లి వెదుకుతున్నారు. ఇంతవరకూ కనిపించకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement