పుట్టపర్తిలో సత్యసాయి సేవ కోసం వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన టోనీబెర్లి (75)ని హత్య చేసిన వాచ్మన్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సోమవారం హిందూపురం జిల్లా అదనపు జడ్జి రాములు తీర్పు చెప్పారు.
హత్యకేసులో వాచ్మన్కు యావజ్జీవం
Sep 20 2016 12:32 AM | Updated on Jul 30 2018 8:29 PM
హిందూపురం అర్బన్:
పుట్టపర్తిలో సత్యసాయి సేవ కోసం వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన టోనీబెర్లి (75)ని హత్య చేసి, తన పొలంలోనే పాతిపెట్టిన సాయిగౌరి అపార్ట్మెంట్ వాచ్మన్ భగవంతుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సోమవారం హిందూపురం జిల్లా అదనపు జడ్జి రాములు తీర్పు చెప్పారు.
ఈ కేసును పబ్లిక్ప్రాసిక్యూటర్ రాజశేఖర్ వాదించగా జడ్జి పలువురు సాక్షులను విచారణ చేసి వాచ్మెన్కు యావజ్జీవంతోపాటు రూ.10వేల జరిమానా విధించారు. సాక్షులను తారుమారు చేసిన కేసులో 203 సెక్షన్ కింద మరో 2సంవత్సరాలు జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్ తెలిపారు.
Advertisement
Advertisement