ఎండిపోతున్న పంటపోలాలను పరిశీలించిన కొత్తపల్లి | Kottapally subba raidu to review on damaged crop fileds | Sakshi
Sakshi News home page

ఎండిపోతున్న పంటపోలాలను పరిశీలించిన కొత్తపల్లి

Feb 16 2016 7:31 PM | Updated on Sep 3 2017 5:46 PM

పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తీర ప్రాంతంలో ఎండిపోతున్న పంటపోలాలను వైఎస్‌ఆర్‌సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మంగళవారం పరిశీలించారు.

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తీర ప్రాంతంలో ఎండిపోతున్న పంటపోలాలను వైఎస్‌ఆర్‌సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మంగళవారం పరిశీలించారు. పంటపోలాలకు సాగునీరు అందక బాధపడుతున్న రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా, నరసాపురం మండలం మెడి గ్రామంలో ఎండిన పంటపోలాలను చూసి ఇరిగేషన్ అధికారులపై రైతులు విరుచుకుపడ్డారు. పంటకాలంలో నీళ్లు అందకపోవడంతో పోలాలు ఎండిపోతున్నాయంటూ వాపోయారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని దత్తత గ్రామమైన పేరుపాలెంలో ఈ నెల 22న కాంగ్రెస్‌ నేత చిరంజీవి పర్యటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement