'సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి' | Kotamreddy sridhar reddy slams TDP leaders of Sand reach tenders | Sakshi
Sakshi News home page

'సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి'

Feb 23 2016 2:11 PM | Updated on May 28 2018 3:04 PM

ఇసుక రీచ్ టెండర్లలో అధికార పార్టీ టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు.

నెల్లూరు: ఇసుక రీచ్ టెండర్లలో అధికార పార్టీ టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.  

నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడి వారి కోసం పోరాటం చేస్తామని కోటంరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement