చదువుతోనే రాజకీయాలు సాధ్యం | kanakadasa jayanthi in sadlapalli | Sakshi
Sakshi News home page

చదువుతోనే రాజకీయాలు సాధ్యం

Nov 17 2016 11:19 PM | Updated on Sep 4 2017 8:22 PM

చదువుతోనే రాజకీయాలు సాధ్యం

చదువుతోనే రాజకీయాలు సాధ్యం

సమాజంలో కురుబలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరుశురాం అన్నారు.

లేపాక్షి : సమాజంలో కురుబలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరుశురాం అన్నారు. గురువారం మధ్యాహ్నం లేపాక్షి మండలం పి.సడ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాష్ట్రంలో కనకదాసు జయంతి వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

అదేవిధంగా కురుబలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వివరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ, పరిగి ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు బుల్లే జగదీష్, వసికేరి రమేష్‌, వసికేరి లింగమూర్తి, వసికేరి శివ, దేవరగుడి వేణుగోపాల్‌, బాలాజి, అశ్వర్థప్ప, కృష్ణమూర్తి, స్థానిక అధ్యక్ష, కార్యదర్శి కగ్గల్లప్ప, మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement