శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ చలమేశ్వర్ | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ చలమేశ్వర్

Published Thu, Aug 4 2016 7:23 PM

Justice chalamesvar Visit Tirumala

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు వేర్వేరుగా ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, ఆ తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement