బనగానపల్లె రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలోనే రాయల సీమకు సాగు నీటి విషయంలో పూర్తి అన్యాయం జరిగిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం బనగానపల్లె పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో రాయలసీమ సాగునీటి సాధన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ శైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులను జీవో నంబర్ 69 ద్వారా తగ్గించింది చంద్రబాబునాయుడేనని చెప్పారు. రాయలసీమకు సాగునీరు, తాగు నీరు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే 1996లో ఆ జీవో విడుదల చేశారని ఆరోపించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యమేనన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో పథకం నిర్మాణం అగిపోయిందన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితితో పాటు ఇక్కడి రైతులు చేస్తున్న ఉద్యమాలకు కంటితుడుపు చర్యగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని బాబు ప్రారంభించారన్నారు. బాబుకు ధైర్యం ఉంటే పట్టిసీమ ద్వారా రాయలసీమకు వచ్చే 191 టీఎంసీల నీటి హక్కులపై చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. సీమకు ఇచ్చే నీటి విషయంలో చట్టబద్ధత కల్పించాలని మే నెలలో నంద్యాల లేదా సిద్ధేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ ఎత్తున రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ ఎ. రామచంద్రారెడ్డి, నంద్యాల రైతు సంఘం నాయకులు వై.ఎన్.రెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు జిల్లెల్ల శివరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు దొనపాటి యాగంటిరెడ్డి, మహానందరెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు.
బాబు పాలనలోనే సీమకు అన్యాయం
Published Tue, Jan 3 2017 11:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement