ప్రత్యేక హోదా సాధన కోసం తిరుమలకు పాదయాత్ర | hugo for special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా సాధన కోసం తిరుమలకు పాదయాత్ర

Sep 16 2016 12:15 AM | Updated on Sep 4 2017 1:37 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి తనయుడు దువ్వూరు మాజీ ఎంపీపీ గోపాల్‌రెడ్డి ఆధ్వరంలో గురువారం దువ్వూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.


మైదుకూరు టౌన్‌:  రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి తనయుడు దువ్వూరు మాజీ ఎంపీపీ గోపాల్‌రెడ్డి ఆధ్వరంలో గురువారం దువ్వూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను తిరుపాల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకుల మనసులు మారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 40 మందితో కలసి తిరుమలకు  బయలుదేరి వెళ్లారు. ఈ పాదయాత్రలో ఎం.రామ్‌నాథ్‌రెడ్డి, వీరారెడ్డి, శివానందరెడ్డి, యల్లారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర మైదుకూరు సమీపంలో కి రాగానే వైఎస్సార్‌సీపీ నాయకులు గోశెట్టి లక్షుమయ్య, ధనపాల జగన్, రవీంద్రలు ఘన స్వాగతం పలికి సంఘీభావం పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement