వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగయాత్ర | Heroic sacrifices for recite Tirangayatra | Sakshi
Sakshi News home page

వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగయాత్ర

Aug 27 2016 12:29 AM | Updated on Sep 4 2017 11:01 AM

వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగయాత్ర

వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగయాత్ర

భారతదేశానికి స్వేచ్ఛా వాయువులను అందించేందుకు ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగ యాత్రను చేపట్టినట్లు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అన్నారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పరకాలలో తిరంగయాత్రను నిర్వహించారు.

పరకాల : భారతదేశానికి స్వేచ్ఛా వాయువులను అందించేందుకు ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగ యాత్రను చేపట్టినట్లు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అన్నారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పరకాలలో తిరంగయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌ నుంచి ఆర్టీసీ డిపో వరకు 200 మీటర్ల జాతీయ జెండాతో వందలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జంగారెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు తిరంగయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో సెప్టెంబర్‌ 17వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ పెసరు విజయచందర్‌రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు  కానుగుల గోపినాథ్, ముస్కే సంతోష్, పల్లెబోయిన సురేష్, మేకల రాజవీరు, రామన్న, జయపాల్‌రెడ్డి, సర్పంచ్‌ భిక్షపతి, సంఘమేశ్వర్, లెక్చరర్లు, విద్యార్దులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement