గూడ్స్‌కు తృటిలో తప్పిన ప్రమాదం | goods train catches fire, no injuries reported | Sakshi
Sakshi News home page

గూడ్స్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Dec 2 2016 11:06 AM | Updated on Sep 5 2018 9:47 PM

చీపురుపల్లి వద్ద శుక్రవారం గూడ్స్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది.

విజయనగరం: విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కుర్దా నుంచి విశాఖకు వస్తున్న గూడ్స్ రైలు వీల్ యాక్సిల్ నుంచి మంటలు చెలరేగడంతో లోకో పైలట్ గమనించి చీపురుపల్లి వద్ద రైలును నిలిపివేశాడు. ఈ విషయం తెలుసుకున్న విశాఖపట్టణం డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ ఘటనాస్ధలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
 
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతోనే పెను ప్రమాదం తప్పిందని ఆమె తెలిపారు. మరమ్మత్తుల అనంతరం రైలు తిరిగి మధ్యాహ్నం బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement