ఈతకు వెళ్లి విద్యార్థి మృతి | going to swim student dead | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

Aug 13 2016 9:33 PM | Updated on Nov 9 2018 5:02 PM

ఓదెల : మండలంలోని పొత్కపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి సిరిశేటి రాము(11) శనివారం ఊరకుంటలో మునిగి మృతిచెందాడు. పాఠశాలకు సెలవు కావటంతో ఈత కోసం మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. మిషన్‌ కాకతీయ పథకంలో ఇటీవల చెరువలో పూడిక తీశారు. ఆ గుంతల్లో నీరు ఉండడంతో రాము ఈత కొట్టేందుకు దిగాడు.

ఓదెల : మండలంలోని పొత్కపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి సిరిశేటి రాము(11) శనివారం ఊరకుంటలో మునిగి మృతిచెందాడు. పాఠశాలకు సెలవు కావటంతో ఈత కోసం మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. మిషన్‌ కాకతీయ పథకంలో ఇటీవల చెరువలో పూడిక తీశారు. ఆ గుంతల్లో నీరు ఉండడంతో రాము ఈత కొట్టేందుకు దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగి ఊపిరాడక మృతిచెందాడు. ఎస్సై టి.శంకరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement