రైతులకు నష్టపరిహారం అందజేస్తాం | give compensation to farmers | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టపరిహారం అందజేస్తాం

Oct 6 2016 9:49 PM | Updated on Oct 1 2018 2:09 PM

రైతులకు నష్టపరిహారం అందజేస్తాం - Sakshi

రైతులకు నష్టపరిహారం అందజేస్తాం

మఠంపల్లి : మండలంలోని మఠంపల్లి నుంచి మేళ్లచెరువు వరకు నిర్మించిన రైల్వేలైన్‌ నిర్మాణంలో గల పెండింగ్‌ భూములను గురువారం జిల్లా జేసీ సత్యనారాయణ పరిశీలించారు.

మఠంపల్లి : మండలంలోని మఠంపల్లి నుంచి మేళ్లచెరువు వరకు నిర్మించిన రైల్వేలైన్‌ నిర్మాణంలో గల పెండింగ్‌ భూములను గురువారం జిల్లా జేసీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఠంపల్లి నుంచి మేళ్లచెరువు వరకు రైల్వేలైన్‌లో భూములు కోల్పోయిన రైతులకు పూర్తినష్టపరిహారం అందజేశామన్నారు. కాగా 7 ఎకరాల ఏడున్నర కుంటల పెండింగ్‌ భూములకు నష్ట పరిహారం చెల్లించాల్సిన భూములను పరిశీలించామన్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం 7 ఎకరాల ఏడున్నర గుంటల రైతులకు కూడా నష్టపరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ ఆర్డీఓ  కిషన్‌రావు, ఆర్‌ఐ శైలజ, వీఆర్‌ఓ యాదయ్య, సిమెంట్‌ పరిశ్రమల అధికారులు, స్థానిక రైతులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement