నచ్చిన ఛానల్ పెట్టలేదని బాలిక ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

నచ్చిన ఛానల్ పెట్టలేదని బాలిక ఆత్మహత్య

Published Wed, Jan 20 2016 1:31 PM

నచ్చిన ఛానల్ పెట్టలేదని బాలిక ఆత్మహత్య - Sakshi

వాంకిడి : టీవీ ఛానల్ విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ.. తండ్రి మందిలింపు... చివరికి ఓ బాలిక ఆత్మహత్యకు దారి తీసింది. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కోమటిగూడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది.  
 
పోలీసుల కథనం ప్రకారం వి.జ్యోతి (13) మంగళవారం రాత్రి తెలుగు చానల్ పెట్టాలని కోరింది. పండుగకు మహారాష్ట్ర నుంచి పుట్టింటికి వచ్చిన జ్యోతి సోదరి హిందీ చానల్ పెట్టాలని పట్టుబట్టింది. ఈ విషయంలో జ్యోతిపై ఆమె సోదరి చేయి చేసుకుంది. తండ్రి రామారావు జోక్యం చేసుకుని చిన్నకుమార్తె జ్యోతిని మందలించాడు. మనస్తాపం చెందిన ఆమె రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. 

Advertisement
Advertisement