5 నుంచి దుర్గగుడిపై గణపతి నవరాత్రులు | ganesh navaratrulu at indrakiladri | Sakshi
Sakshi News home page

5 నుంచి దుర్గగుడిపై గణపతి నవరాత్రులు

Aug 31 2016 8:59 PM | Updated on Sep 4 2017 11:44 AM

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్‌ 5 నుంచి 13వ తేదీ వరకు గణపతి నవరాత్రుల మహోత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : 
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్‌ 5 నుంచి 13వ తేదీ వరకు గణపతి నవరాత్రుల మహోత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదో తేదీ ఉదయం గణపతి పూజ, కలశస్థాపన, విశేష పత్రి పూజతోపాటు కథా శ్రవణం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీగణపతి హోమం, సాయంత్రం ఆవాహన దేవతా హోమం నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు పూర్ణాహుతిలో ఉత్సవాలు ముగుస్తాయని, సాయంత్రం 5 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు ఉంటుందని అధికారులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement