
సర్వం సిద్ధం – అక్టోబర్ 2 వరకు నిర్వహణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: దసరా నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారు 11 అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి దర్శనం తొలిరోజు మినహా రోజూ ఉదయం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది.
ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 2 విజయ దశమి రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. కాగా, అమ్మవారు సోమవారం శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా దర్శనమివ్వనున్నారు.
శైలపుత్రి అలంకారంలో శ్రీశైల భ్రామరి
దసరా మహోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీశైలం భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.