అంధుల పాఠశాలకు భూమి పూజ | foundation stone to blind school building | Sakshi
Sakshi News home page

అంధుల పాఠశాలకు భూమి పూజ

Aug 12 2016 11:40 PM | Updated on Apr 3 2019 4:04 PM

శ్రీరాంపూర్‌ ఎడ్ల అంగడీ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సాయి అంధుల పాఠశాల భవనానికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే ఎన్‌ దివాకర్‌రావు శుక్రవారం భూమి పూజ చేశారు. మంచిర్యాలలో సేవాభావంతో అద్దె గదుల్లో నడుస్తున్న ఈ ప్రై వేటు అంధుల పాఠశాలకు సివిల్‌ కాంట్రాక్టర్‌ మల్రాజు రవీందర్‌రావు ఇక్కడి తన స్థలం లో 10 గుంటల స్థలాలను విరాళంగా ఇచ్చారు.

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఎడ్ల అంగడీ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సాయి అంధుల పాఠశాల భవనానికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే ఎన్‌ దివాకర్‌రావు  శుక్రవారం భూమి పూజ చేశారు. మంచిర్యాలలో సేవాభావంతో అద్దె గదుల్లో నడుస్తున్న ఈ ప్రై వేటు అంధుల పాఠశాలకు సివిల్‌ కాంట్రాక్టర్‌ మల్రాజు రవీందర్‌రావు ఇక్కడి తన స్థలం లో 10 గుంటల స్థలాలను విరాళంగా ఇచ్చారు.
        ఎమ్మెల్సీ మాట్లాడుతూ భవన నిర్మాణం కోసం తన నిధుల నుంచి రూ. 5 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు అశోక్‌రావు, మంచిర్యాల ఎంఈవో ప్రభాకర్‌రావు, సబ్‌ రిజిస్టార్‌ రాంబాబు, సర్పంచులు తేలేటి కిష్టయ్య, ఎం.రాజేంద్రపాణి, మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ వసుందర, వైస్‌ చైర్మన్‌ నల్ల శంకర్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement