మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి అస్వస్థత

Published Wed, May 18 2016 12:40 PM

మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి అస్వస్థత

అనంతపురం: అనంతపురం రూరల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి బుధవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో చేస్తున్న జలదీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన గుర్నాథరెడ్డి కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను పరీక్షిస్తున్నారు. అనంతపురం నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు బుధవారం ఉదయం బయలుదేరాయి. అదే సమయంలో గుర్నాథరెడ్డి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.
 

Advertisement
Advertisement