ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు శుక్రవారం చివరి నిమిషంలో రద్దయ్యాయి. రూ.112 కోట్ల విలువైన ఈ పనుల టెండర్ల నిర్వహణలో జరిగిన లోటుపాట్లపై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు టెండర్ను రద్దు చేశారు. టెండర్ నోటిఫికేషన్లో జరిగిన తప్పులను సరిదిద్ది త్వరలో మళ్లీ జారీ చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాలిలా వున్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి మంచినీరు అందించేందుకు మొత్తం రూ.183కోట్ల వరద కాలువ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం రూ.112కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్లు నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి అభ్యంతరం లేనిచోట పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. అయితే టెండర్ నిబంధనల తీరుపై పలువురు కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారశైలిని విమర్శించారు. టెండర్లు నిర్వహిస్తే కోర్టును ఆశ్రయించేందుకు కూడా కొందరు కాంట్రాక్టర్లు, నేతలు సిద్ధమయ్యారు. అలాగే పలువురు నేతలు కూడా ఈ నిబంధనల పట్ల అధికారులను ప్రశ్నించారు. అలాగే ఈ పనులను ఎలాగైనా దక్కించుకునేందుకు స్థానికంగా అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరి రోజు కావడంతో శుక్రవారం హైదరాబాద్లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి వెళ్లారు. విమర్శలు వెల్లువెత్తడంతో టెండర్లో పొరపాట్లను గమనించిన ఇంజనీరింగ్ అధికారులు శుక్రవారం సాయంత్రం 3.30 ప్రాంతంలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ టెండర్కు పోటీపడిన తెలుగు తమ్ముళ్లు నిరాశతో వెనుదిరికి వచ్చారు.
మార్పులు చేయాల్సి ఉంది: ఎస్ఈ
ఈ విషయంపై చిన్ననీటిపారుదల శాఖ జిల్లా ఎస్ఈ శంకర్రెడ్డిని సాక్షి వివరణ కోరగా కమిషనర్ ఆఫ్ టెండర్స్ నిబంధనల ప్రకారం జాయింట్ వెంచర్లు టెండర్లో పాల్గొనకూడదన్నారు. తమకు ఈ విషయం తెలియకపోవడంతో జాయింట్ వెంచర్లను కూడా ఆహ్వానించామన్నారు. అలాగే సర్ఫేస్ డ్యాం నిబంధనల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రద్దయిన వరద కాలువ పనులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని వీలైనంత త్వరలో తిరిగి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.
వరద కాలువ టెండర్లు రద్దు
Published Sat, Oct 15 2016 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement