హిందూపురం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది.
హిందూపురం (అనంతపురం జిల్లా): హిందూపురం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కార్యాలయంలోని విలువైన కంప్యూటర్లు, డాక్యుమెంట్లతో పాటు ఫర్నిచర్ కూడా కాలిబూడిదైంది.
సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.