పత్తికొండలోని ఆదోని రహదారిలో సవారమ్మ దేవాలయం సమీపంలోని పెట్రోల్ బంక్లో మంటలు చెలరేగడంతో వాహనదారులు ఆందోళన చెందారు.
పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం
Mar 4 2017 12:38 AM | Updated on Sep 3 2019 9:06 PM
పత్తికొండ: పత్తికొండలోని ఆదోని రహదారిలో సవారమ్మ దేవాలయం సమీపంలోని పెట్రోల్ బంక్లో మంటలు చెలరేగడంతో వాహనదారులు ఆందోళన చెందారు. శుక్రవారం ఉదయం వాహనాల్లో పెట్రోల్, డీజిల్ వేస్తుండగా ఓ పంప్లోని మోటారు వద్ద షార్ట్సరూ్క్యట్తో మంటలు చెలరేగాయి. బంక్ యాజమాన్యం వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గురువారం డీజిల్ ట్యాంకర్ అన్ లోడ్ చేశారు, ఏదైనా ప్రమాదం జరిగినట్లైతే ప్రమాద నష్టం తీవ్రంగా ఉండేది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో కాలనీ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
Advertisement
Advertisement