భాదిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేత | Sakshi
Sakshi News home page

భాదిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

Published Wed, Aug 17 2016 6:43 PM

భాదిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేత - Sakshi

ఐలాపురం(చివ్వెంల) : మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ మేలినాటి రామక్రిష్ణ ఇటివల గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి ఆర్‌ఎంపీల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన యూత్‌ ఆధ్వర్యంలో రూ.32వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ, చివ్వెంల మండల అధ్యక్షుడు కె. వెంకన్న, శ్రీను. దామోదర్, జానయ్య, క్రిష్ణ, యూత్‌ సభ్యులు వెంకటరమణ, సతీష్, నాగరాజు, సైదులు, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement