కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన చెంచు బీరయ్య(45) అనే రైతు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు.
కరెంట్ షాక్తో రైతు మృతి
Aug 29 2016 10:31 PM | Updated on Oct 1 2018 2:44 PM
ధర్మారం : కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన చెంచు బీరయ్య(45) అనే రైతు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. బీరయ్య సోమవారం ఉదయం గ్రామ శివారులో కౌలుకు సాగుచేసిన వరి పొలానికి నీరు పెట్టేందుకుళ్లాడు. కరెంటు మోటారు పెట్టిన తర్వాత పైపు పైనుంచి దాటుతుండగా దానికి విద్యుత్ ప్రసారం జరిగి షాక్కు గురై మరణించాడు. ఉదయం వర్షం పడటంతో మోటారుకు కరెంటు షాక్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య మల్లేశ్వరి, ఇద్దరు కుమారులున్నారు.
Advertisement
Advertisement