విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసొసియేషన్ జిల్లా కమిటీని స్థానిక సంపత్ నగర్లోని అతిథి గృహంలో శనివారం ఎన్నుకున్నారు.
ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
Oct 9 2016 12:48 AM | Updated on Sep 5 2018 2:06 PM
కర్నూలు(రాజ్విహార్): విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసొసియేషన్ జిల్లా కమిటీని స్థానిక సంపత్ నగర్లోని అతిథి గృహంలో శనివారం ఎన్నుకున్నారు. రెండేళ్ల కాలపరిమితి గల కమిటీకి మదన్ మోహన్ (నందికొట్కూరు ఏఈ) నూతన అధ్యక్షుడిగా ఎన్. గోవిందు (జోనల్ కార్యాలయ ఏఈ) కార్యదర్శిగా, పి. శ్రీనివాసరెడ్డి (గూడూరు ఏఈ) కోశాధికారిగా, బి.ఎం. ఎస్. రంగరాజు (నంద్యాల సబ్ ఇంజనీర్) ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యదర్శి సాయి సుధాకర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
Advertisement
Advertisement