రోడ్డు ప్రమాదంలో 11 మంది కూలీలకు గాయాలు | Eleven Are Injured in Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 11 మంది కూలీలకు గాయాలు

Oct 8 2016 10:57 PM | Updated on Sep 4 2017 4:40 PM

సంగాలపల్లె వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

వీరపునాయునిపల్లె: సంగాలపల్లె వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనిమెల గ్రామం వద్ద జరుగుతున్న గాలి మరల నిర్మాణపు పనుల కోసం ఎర్రగుంట్ల, చిలంకూరు ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు రోజూ లాగే శనివారం కూడా సాయంత్రానికి పనులను ముగించుకుని ఆటోలో స్వగ్రామాలకు వెళ్తున్నారు. సంగాలపల్లె వద్ద వేంపల్లె వైపు నుంచి వస్తున్న ట్యాంపర్‌ వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కన వున్న పొలాల్లోకి దూసుకొని వెళ్లగా అందులో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మల్లికార్జున, నాగరాజు, బాలయ్య, అబ్దుల్లా, షరీఫ్‌తోపాటు మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. వీరిని స్థానికులు 108 వాహనం ద్వారా ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement