ప్రమాదవశాత్తు రైలుఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు (60) మృతిచెందిన సం ఘటన జనగామ రైల్వేస్టేన్వద్ద బుధవారం చోటు చేసుకుంది.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
Aug 18 2016 12:11 AM | Updated on Aug 25 2018 4:51 PM
జనగామ : ప్రమాదవశాత్తు రైలుఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు (60) మృతిచెందిన సం ఘటన జనగామ రైల్వేస్టేన్వద్ద బుధవారం చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సమ్మిరెడ్డి కథనం ప్రకారం... గుర్తు తెలియని వృద్ధుడు స్థానిక హెడ్ పోస్టాఫీస్ వైపు ఉన్న కిరాణం దుకాణం నుంచి సామగ్రిని పట్టుకు ని రైలుపట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమం లో సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న షిర్డీఎక్స్ప్రెస్ ఆయనను ఢీకొట్టగా అక్కడి క క్కడే మృతిచెందాడు. కాగా, మృతుడికి సం బంధించిన వివరాలు తెలియరాలేదని హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement