రూ.791 కోట్ల నిధులను దారి మళ్లించారు | Diverting the funds of Rs .791 crore | Sakshi
Sakshi News home page

రూ.791 కోట్ల నిధులను దారి మళ్లించారు

Nov 9 2016 4:44 AM | Updated on Mar 29 2019 9:31 PM

రూ.791 కోట్ల నిధులను దారి మళ్లించారు - Sakshi

రూ.791 కోట్ల నిధులను దారి మళ్లించారు

కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్ల కరువు నిధులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు.

భువనగిరి మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్

 సాక్షి, యాదాద్రి: కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్ల కరువు నిధులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా యన్నారు.

రుణమాఫీ కింద రావల్సిన రూ.8 వేల కోట్ల బకారుులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 1.60 లక్షల సబ్సిడీతో కేంద్రం 91 వేల ఇళ్లను మంజూరు చేస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వలేదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement