
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి సర్వ దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.
కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 64,386 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.