రాజగోపాల్‌రెడ్డిపై ఆరోపణలు తగవు

రాజగోపాల్‌రెడ్డిపై ఆరోపణలు తగవు

నకిరేకల్‌ : ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.



అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరి చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. నయీంతో కూడా జిల్లాకు చెందిన కొందురు టీఆర్‌ఎస్‌ వారితో సంబంధాలున్నాయన్నారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, మారం చెన్నకృ ష్ణారెడ్డి, నకిరేకంటి ఏసుపాదం, యాస కర్ణాకర్‌రెడ్డి, గుర్రం గణేష్, మాద నగేష్, నవీన్‌రావు, పల్లె విజయ్‌ ఉన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top