సీపీఎస్ విధానం రద్దు చేయాలి | CPS policy should be canceled | Sakshi
Sakshi News home page

సీపీఎస్ విధానం రద్దు చేయాలి

Nov 24 2016 2:28 AM | Updated on Sep 4 2017 8:55 PM

సీపీఎస్ విధానం రద్దు చేయాలి

సీపీఎస్ విధానం రద్దు చేయాలి

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ భవనంలో అత్యవసర సమావేశం నిర్వహిం చారు.

28న ఢిల్లీలో ధర్నా
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి

ఆదిలాబాద్ టౌన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ భవనంలో అత్యవసర సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతోం దని తెలిపారు. ఈ నెల 28న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అరుణ్‌జెట్లీకి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. భా షాపండిత్, పీఈటీ పోస్టులకు సంబంధించిన అప్‌గ్రేడ్ జీవోలను విడుదల చేయాలని అన్నారు.

ఖాళీగా ఉన్న ఉ పాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవన్, రత్నాకర్‌రెడ్డి, సంఘ బాధ్యులు సత్యానారాయణగౌడ్, రమేష్, రాజన్న, మెట్టు ప్రహ్లద్, సారయ్య, కృష్ణకుమార్, మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement