దొంగనోట్ల కలకలం | Counterfeiter uproar | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల కలకలం

Aug 27 2016 12:55 AM | Updated on Sep 4 2017 11:01 AM

మండలంలోని చెల్పూరు గ్రామం లో 1000 రూపాయల దొంగనోట్లు కలకలం సృష్టించా యి. భూపాలపల్లి మండలం మో రంచపల్లి గ్రామ∙శివారు దుబ్బపల్లికి చెందిన రైతు బొజ్జ లచ్చయ్య స్థానిక చెల్పూరు గ్రామీ ణ వికాస బ్యాంక్‌లో బుధవారం రూ.13 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాడు. బ్యాంకు క్యాషియర్‌ అన్ని వెయ్యి రూపాయల నోట్లను ఇచ్చాడు.

గణపురం : మండలంలోని చెల్పూరు గ్రామం లో 1000 రూపాయల దొంగనోట్లు కలకలం సృష్టించా యి. భూపాలపల్లి మండలం మో రంచపల్లి గ్రామ∙శివారు దుబ్బపల్లికి చెందిన రైతు బొజ్జ లచ్చయ్య స్థానిక చెల్పూరు గ్రామీ ణ వికాస బ్యాంక్‌లో బుధవారం రూ.13 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాడు. బ్యాంకు క్యాషియర్‌ అన్ని వెయ్యి రూపాయల నోట్లను ఇచ్చాడు.
 
సదరు రైతు గురువారం ఆ నోట్లను చెలామణి చేయడానికి పలు షాపులు తిరిగా డు. తిరిగిన ప్రతిచోట నోట్లను పరిశీలిం చి ఇవి దొంగనోట్లని దుకాణదారులు అనడంతో రైతు ఆందోళన చెందాడు. శుక్రవారం మోరంచపల్లికి చెందిన కొంతమందిని తీసుకుని బ్యాంకుకు వెళ్లి మేనేజర్, క్యాషియర్‌ను నిల దీశారు. నాలుగు వెయ్యి రూపాయల నోట్లను క్యాషియర్‌ తీసుకొని వేరేనోట్లను రైతుకు అందజేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది. కాగా ఆ నోట్లు దొంగనోట్లు కావని, గతంలో రిజర్వ్‌బ్యాంకు రద్దు చేసిన నోట్లని బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement