విద్యుదాఘాతంతో పత్తి రైతు మృతి | Cotton farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో పత్తి రైతు మృతి

Sep 13 2016 6:30 PM | Updated on Sep 4 2017 1:21 PM

పొలంలో దున్నుతున్న రైతు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌నకు గురై మృతి చెందాడు.

పొలంలో దున్నుతున్న రైతు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌నకు గురై మృతి చెందాడు. వివరాలివీ... ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన తెల్లబోయిన వెంకటేశ్వర్లు(53) రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. మంగళవారం మధ్యాహ్నం కలుపు తీతలో భాగంగా దున్నుతున్నాడు. నాగలికి పక్కనే స్తంభం నుంచి ఉన్న జీ వైర్ తాకటంతో షాక్‌తో వెంకటేశ్వర్లు పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement