తైక్వాండో విజేతలకు అభినందనలు | congrats to taiquando players | Sakshi
Sakshi News home page

తైక్వాండో విజేతలకు అభినందనలు

Oct 2 2016 10:34 PM | Updated on Sep 4 2017 3:55 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గత నెల 25 నుంచి 27 వరకు నిర్వహించిన అండర్‌–14,17 తైక్వాండో పోటీల్లో జిల్లా జట్టు 7 బంగారు పతకాలు సాధించిందని ఏపీ స్కూల్‌ గేమ్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు అంజయ్య, నారాయణ తెలిపారు.

♦  ఏడు పతకాలు సాధించిన జిల్లా జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గత నెల 25 నుంచి 27 వరకు నిర్వహించిన   అండర్‌–14,17 తైక్వాండో పోటీల్లో జిల్లా జట్టు 7 బంగారు పతకాలు సాధించిందని ఏపీ స్కూల్‌ గేమ్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు అంజయ్య, నారాయణ  తెలిపారు. పతకాలు సాధించిన  లాసీరెడ్డి, ధరణీ, రోజా, సాయిదీప్తి, హర్షితారెడ్డి, నాగగుర్రప్ప, దత్తుసాయి   జాతీయ జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు.   క్రీడాకారులను కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు.  జాతీయ స్థాయి పోటీలు  సోమవారం నుంచి 7 వరకు   వరంగల్‌లో నిర్వహిస్తారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement