ఏలూరు (మెట్రో) : జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులను ఆదేశించారు.
వైద్య, ఆరోగ్య శాఖపై కలెక్టర్ సమీక్ష
Aug 11 2016 10:22 PM | Updated on Sep 4 2017 8:52 AM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన వైద్యారోగ్యశాఖ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వైద్యుల ఖాళీలను త్వరితగతిన గుర్తించి భర్తీపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో తల్లీబిడ్డల మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా తల్లీబిడ్డల మరణాలు సంభవించకుండా వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంహెచ్వో కె.కోటేశ్వరిని ఆదేశించారు. జిల్లాలో తల్లీబిడ్డల మరణాలు (మాతా శిశు మరణాలు) సంభవిస్తే సంబంధిత వైద్యసిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ భాస్కర్ హెచ్చరించారు. అదనపు వైద్యాధికారి వంశీలాల్ రాథోడ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement