15న చిత్తూరు మేయర్‌ ఎన్నిక | Chittoor mayoral election on 15th | Sakshi
Sakshi News home page

15న చిత్తూరు మేయర్‌ ఎన్నిక

Apr 4 2017 2:03 AM | Updated on Aug 13 2018 3:16 PM

15న చిత్తూరు మేయర్‌ ఎన్నిక - Sakshi

15న చిత్తూరు మేయర్‌ ఎన్నిక

చిత్తూరు నగర పాలక సంస్థకు మేయర్‌ను ఎన్నుకోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం

చిత్తూరు (అర్బన్‌): చిత్తూరు నగర పాలక సంస్థకు మేయర్‌ను ఎన్నుకోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టతనిచ్చింది. సోమవారం ఈసీ నుంచి కమిషనర్‌కు ఆదేశాలు అందాయి. దీని ప్రకారం మూడు పనిదినాల్లోపు కార్పొరేటర్లకు, ఎక్స్‌–అఫిషియో సభ్యులకు (ఎమ్మెల్యే) సమాచారం అందించాలని ఈసీ పేర్కొంది. నగరంలోని 38వ డివిజన్‌ ఎన్నికలు ఈనెల 9న జరగనుండటం, 11న ఓట్ల లెక్కింపు పూర్తవనుండటంతో అదేరోజు జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

ఈనెల 15వ తేదీ చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌లో ఒకరు సమావేశానికి హాజరవుతారని.. ఉన్న కార్పొరేటర్లలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను ఒకర్ని పరోక్ష పద్ధతిలో మేయర్‌గా ఎన్నుకోవాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్‌ 15లోపు చిత్తూరు మేయర్‌ ఎన్నిక పూర్తి చేస్తామని హై కోర్టుకు ఈసీ లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఆ మేరకు చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement