యాదాద్రి పనుల పరిశీలన | checking the yadadri works | Sakshi
Sakshi News home page

యాదాద్రి పనుల పరిశీలన

Oct 2 2016 11:31 PM | Updated on Sep 4 2017 3:55 PM

యాదాద్రి పనుల పరిశీలన

యాదాద్రి పనుల పరిశీలన

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కూల్చివేతలు, రాజగోపురాల నిర్మాణ పనులను వైటీడీఏ వైస్‌ చైర్మెన్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్టులు ఆనంద్‌సాయి, బడే రవిలు ఆదివారం పరిశీలించారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కూల్చివేతలు, రాజగోపురాల నిర్మాణ పనులను వైటీడీఏ వైస్‌ చైర్మెన్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్టులు ఆనంద్‌సాయి, బడే రవిలు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూల్చివేసిన  ప్రధానాలయాన్ని, నిర్మాణంలో ఉన్న రాజగోపురాలను పరిశీలించారు. అనంతరం వైటీడీఏ వైస్‌చైర్మెన్‌ కిషన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రార్‌ను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ దసరా రోజున రాజగోపురాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని సూచించారు. యాదాద్రి కోసం హైదరాబాద్‌లోని కోహెడ, గుంటూరు, గురిజాలపాలెం, మార్టూరులో శిల్పాలు తయారవుతున్నాయని తెలిపారు. దసరా రోజున ఉదయం 8.19 గంటలకు ఓ శిల్పాన్ని స్థాపించనున్నట్లు తెలిపారు. ప్రధానాలయంలో సుమారు 60 ఫీట్ల ఎత్తులో ధ్వజస్తంభం, 20 ఫీట్ల ఎత్తులో బలిపీఠం నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ గీతారెడ్డి, దేవస్థాన అధికారులు దయాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement